వ్యవసాయ పంటలకు పెద్దగా దిగుబడి రావడం లేదు. ఆరుగాలం కష్టపడి చేసినా అంతగా ఆదాయం రావడం లేదు. కానీ ఉద్యాన పంటలు పెట్టిన వారికి అధికంగా ఆదాయం వస్తోంది. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం పండ్ల మొక్కల పంపిణీతో పాటు మూడేళ్ల పాటు నిర్వహణ, నీటి సరఫరా, మందులు, ఎరువలకు అయ్యే మొత్తాన్ని అందజేస్తోంది. ఇదంతా అందరికీ తెలిసిందే కాగా.. తాజాగా పండ్లతోటలు పండించే రైతులకు మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సాగు కోసం రాయితీని భారీగా పెంచింది.