గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మల్కాపురంలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ నానా హంగామా చేశాడు. రాంబాబు అనే వ్యక్తి బెట్టింగ్కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ టవర్ ఎక్కాడు. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పటంతో కిందకు దిగాడు. అయితే సినీ సెలబ్రిటీలు ప్రమోట్ చేయటంతోనే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి అప్పుల పాలైనట్లు రాంబాబు చెప్తున్నారు.