Guntur Mirchi Yard Free Meals For Farmers: గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లే రైతులకు ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రోజూ యార్డ్కు వచ్చే రైతులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఉదయం టిఫిన్, భోజనం పెడుతున్నారు. గతంలో కూడా ఈ కార్యక్రమం ఉండేది. కొంతకాలంగా ఆగిపోయింది.. ఇటీవల మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్న కుర్రా అప్పారావు మళ్లీ టెండర్లు పిలిచి ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.