రైల్వే గేట్ల వల్ల ప్రాజెక్టుల వల్ల ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడే ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో నిత్యం నరకం చూస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి రైల్వే గేట్ల వల్ల ఏర్పడుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. ముఖ్యంగా గుడివాడ పట్టణంలోని రైల్వే గేట్ల సమస్యల పరిష్కారం కొరకు రూ.400 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని నేరుగా స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. అయితే వీటితోనే 8 రైల్వే పైవంతెనలు, అండర్ పాస్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు.