గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్.. అక్కడే నిర్మాణం ..

2 months ago 5
తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా కలిగిన కార్మికులకు తమ నివాసాలకు సమీపంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article