ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ గడువు మరో మూడు నెలలు పొడిగించింది. అక్రమ, అనధికారిక లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఆగస్ట్ నెలలో ఏపీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ గడువు అక్టోబర్ 31తో ముగుస్తోంది. అయితే లేఅవుట్ల డెవలపర్లు, ప్లాట్ల యజమానుల నుంచి ఊహించినంత స్పందన లేకపోవటంతో ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 23 వరకూ అవకాశం కల్పిస్తోంది.