అస్సాంలోని గువాహటిలో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుంది. ఆలయ నిర్మాణం కోసం అస్సాం ప్రభుత్వం టీటీడీకి 25 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించింది. గతంలో 10.8 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించేందుకు అస్సాం ప్రభుత్వం అంగీకరించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో గువాహటిలో 25 ఎకరాల్లో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించేందుకు అంగీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.