తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన నీటి ప్రాజెక్ట్గా పేరుగాంచిన పోచారం ప్రాజెక్ట్ ఈసారి మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది. ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఎటువంటి సమస్య లేకుండా సురక్షితంగా నిలబడింది. ప్రాజెక్ట్ గరిష్ట వరద ప్రవాహం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినా, దాదాపు మూడింతల వరదను తట్టుకోవడం ఇంజినీరింగ్ అద్భుతం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గర్వంగా పేర్కొన్నారు.