ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సభ్యులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. అనంతరం తన సొంత డబ్బులతో క్రికెటర్లకు రూ. 5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లకు వారికి జ్ఞాపికలు, పట్టుచీరలు, శాలువాలు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. అంధ మహిళా క్రికెట్ను ఆదరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ కూడా క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు.