AP village and ward secretariat employees promotions: ఏపీలో గ్రామ. వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉప సంఘం ప్రమోషన్లపై చర్చించి, అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.