తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక బిగ్ అలర్ట్. ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి చట్టపరంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో గ్రూప్-2 తుది ఫలితాల ప్రకటన ఆలస్యం అయింది. ఇక గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కాకపోవడంతో.. గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.