తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ విజన్-2047'లో భాగంగా గృహ నిర్మాణ రంగంలో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీ+3 విధానంలో 2 లక్షల నుంచి 4 లక్షల మందికి సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 'క్యూర్, ప్యూర్, ఆర్వోఎస్' అనే మూడు కీలక విధానాలను రూపొందించింది.