three cities under regional ring road: గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాకుండా రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని యోచిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 70 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్కు అప్పగించారు. వచ్చే ఏడాది నాటికి ఈ అంశం ఓ కొలిక్కి రానుంది.