రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనపై స్థానిక కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉనికిని కాపాడేందుకు ప్రత్యేకంగా రంగారెడ్డి మహానగర పాలక సంస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు.. జిల్లాను విడదీయడం వల్ల రాజకీయంగా, పరిపాలన పరంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, జీహెచ్ఎంసీ పరిధిలోకి జిల్లా భూములను మళ్లించడం అశాస్త్రీయమని వారు పేర్కొన్నారు.