తెలుగు భాషాభిమానుల ఆత్రుతకు తెరదించుతూ మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుంచి కూడా భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చే ఆరు నెలల్లో 15 ఏళ్ల పిల్లలను ఎంపిక చేసి అవధానులుగా తీర్చిదిద్దుతామని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగుతల్లి, ఎన్టీఆర్ విగ్రహాలు, ఆంధ్రా వంటకాలు తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.