రంగారెడ్డి జిల్లా మోకిల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నలుగురు వర్సిటీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మృతులలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ, ఒకరు ఎంజీఐటీ విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.