ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం హింసారాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్య ఘటనపై ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. ఈ రోజు ఏం విత్తుతామో.. అదే రేపు పంటగా పండుతుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్ హెచ్చరించారు.