Pithapuram Varma Meet Chandrababu In Amaravati: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం జరిగింది.. ముఖ్యమంత్రి చంద్రబాబును పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. వర్మను చంద్రబాబు అమరావతికి పిలిపించారు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వర్మ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ పదవి అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది.. గవర్నర్ కోటాలో కూడా పదవి రాకపోవడంతో వర్మను అమరావతికి అర్జంటుగా పిలిచి పరిస్థితిని వివరించినట్లు సమాచారం.