దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు తర్వాత తుది ఓటర్ల సంఖ్యతో ముసాయిదా జాబితాను ఈసీ సోమవారం ప్రకటించింది. మొత్తం 93 లక్షల మంది ఓటర్లను అనామలిస్ జాబితాలో చేర్చారు. వీరికి నోటీసులు జారీ చేయనున్నట్లు సీఈఓ వెల్లడించింది. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుంది.