వెలుగొండ ప్రాజెక్టు కోసం 11 గ్రామాల ప్రజలు త్యాగం చేశారు. నల్లమలసాగర్ జలాశంయంలో ముంపునకు గురయ్యే ఈ 11 గ్రామాలు ప్రజలు ఊర్లనే వదిలేసి వెళ్తున్నారు. ఈ జలాశయం ద్వారా 15 లక్షల మంది దాహార్తి తీరడమే కాకుండా, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 7321 నిర్వాసిత కుటుంబాలు ఊళ్లను ఖాళీ చేస్తున్నాయి. వెలుగొండ పునరావాస ప్యాకేజీ కింద 2565 కుటుంబాలకు సుమారు రూ. 318 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మిగతా కుటుంబాలకు కూడా త్వరలోనే డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.