Man Duped Tdp Workers With Fake Video Calls: ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లను వాడుకుని, వారిలా నటిస్తూ తెలంగాణ టీడీపీ నేతల నుంచి డబ్బులు దండుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా నమ్మించి, ఎన్నికల బీఫామ్ల పేరుతో లక్షల్లో మోసం చేశారు. చివరికి పోలీసుల జోక్యంతో అసలు విషయం బయటపడింది.