వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఉన్న చంద్రబాబు నాయుడు, జయమంగళను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. దీంతో జయమంగళ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. జయమంగళ వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి గతేడాది రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా మండలి ఛైర్మన్ పద్ద పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.