ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ సింగపూర్ విమాన సర్వీస్ ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో వంద రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. విజయవాడ సింగపూర్ మధ్య ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుంచి ఈ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.