Chandrababu Naidu Helicopter Weather: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మార్పులు జరిగాయి. హెలికాప్టర్ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని, రోడ్డు మార్గం ద్వారా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్మకారుడు పోశిబాబు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.