Kavitha On Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, హాథిరాం బావాజీ మఠానికి కూడా వెళ్లారు. అయితే ఇటీవల హాథిరాం మఠం అంశం.. అలాగే బంజారాల సమస్యలపై చంద్రబాబు తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని ప్రశంసించారు. అలాగే తెలంగాణ జాగృతి 'జనంబాట' కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కవిత ఆదివారం భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.