ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించడం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారని విమర్శించారు. ఇలాంటి వారిని ఇన్నేళ్లుగా చంద్రబాబు తట్టుకుని నిలబడినందుకు ఆయనకు హ్యాట్సాఫ్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ లాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలని పవన్ అన్నారు. సోమవారం సభలో ప్రవర్తించిన విధంగా.. గవర్నర్గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్ని్ంచారు.