చపాతీ, రోటీలకు ఓ న్యాయం.. ఇడ్లీ, దోసెలకు మరో న్యాయమా... మీరైనా అడగండి.. జనసేన ఎమ్మెల్యే రిక్వెస్ట్

5 months ago 4
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విపక్ష వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించడంతో.. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆసక్తికర ప్రశ్న అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లు సవరించిన సంగతి తెలిసిందే. అయితే చపాతీ, రోటీలపై కేంద్రం జీఎస్టీని తీసేసిందని.. కానీ ఇడ్లీ, దోసె వంటి దక్షిణాది రుచులకు మాత్రం ఐదుశాతం జీఎస్టీని వసూలు చేయడం న్యాయం కాదన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని జీఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద ప్రస్తావించాలని కోరారు.
Read Entire Article