చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు కీలక ఆధారాలు చేపట్టారు. సీసీటీవీల ఆధారంగా నిందితుడు ఎవరు అనేది గుర్తించారు. ఇక ఆ మహిళ వివరాలు కూడా కనుగొన్నారు. పెళ్లి అయి భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళ.. నిందితుడితో కలిసి సహజీవనం చేస్తోందని తేలింది. వీరిద్దరూ నగరంలోనే ఉండగా.. ఆ యువకుడే మహిళను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య చేసి ఆమె మృతదేహాన్ని స్టేషన్ వద్ద వదిలేసి.. అక్కడి నుంచి అస్సాం పారిపోయినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.