లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన బండి సంజయ్.. 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.