హైదరాబాద్ సమీపంలోని యాచారంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు పూజ మంగళవారం ఉరేసుకోగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు మహేష్.. బుధవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారిద్దరి కుటుంబాల్లో చీకటిని నింపింది.