Kataru Anuradha Couple Murder Case Verdict: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ దారుణ హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2015లో మేయర్ దంపతుల హత్య కలకలం రేపింది.