Tirupati Car Accident Three Died: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.