చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. భర్త తిట్టాడంటూ ఓ భార్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. మద్యం మత్తులో రోజూ గొడవపడటమే కాకుండా.. మానేయడానికి మాల వేయించినప్పటికీ, దేవుడి మాల తీసివేసి తాగిరావటంతో భరించలేకపోయింది. ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయింది.