సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని తన తండ్రి గురించి చెబుతూ బాధపడుతుంటే హరీశ్ రావు కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు గతంలో రైతుల ఆవేదన గురించి చెబుతూ ఆయన కంటతడి పెట్టారు. తాజాగా మరోసారి వేదికపై ఓ చిన్నారి ఆవేదనను చూసి ఆ కళ్లు చెమ్మగిల్లాయి.. హరీశ్ రావు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు. ఆయన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తారు. ఈ ఘటన హరీశ్ రావులోని మానవత్వాన్ని, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది.