హైదరాబాద్లోని మీరాలం చెరువులో చిక్కుకున్న 9 మంది కార్మికులను హైడ్రా బృందాలు చాకచక్యంగా కాపాడాయి. కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం చెరువులోకి వెళ్లిన కార్మికులు.. సాంకేతిక సమస్యతో చెరువులో చిక్కుకుపోయింది. దట్టంగా చీకటి, మొసళ్లు, ఎటూ కదలనీయకుండా గుర్రపుడెక్క ఉన్నాయి. వీటిని అధిగమించి హైడ్రా బృందాలు కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. మరోవైపు, భూ కబ్జాలపై కూడా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల మియాపూర్లో రూ. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విడిపించింది.