విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. మే 23వ తేదీ చీపురుపల్లిలోని వ్యాపారి సురేష్ ఇంట్లో చోరీ జరిగింది. మహిళలపై దాడి చేసిన దుండగులు.. బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అయితే టెక్నాలజీ ద్వారా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.