ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న పార్కు సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లో ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను తిరుపతి పోలీసులు విడుదల చేశారు.