Visakhapatnam Hyderabad Lady Doctor Chembu Case: ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.