జనగాం జిల్లాలోని బతుకమ్మ కుంటలో నీటిమట్టం అడుగంటి పోయింది. దీంతో వాకింగ్ కోసమని అటుగా వచ్చిన వాకర్స్ చెరువులో పైనే తేలియాడుతున్న చేపలను చూశారు. దీంతో ఒక్కసారిగా చెరువులోకి దిగి వాటిని పట్టుకొని వెళ్లిపోయారు. గతంలో వలలతో పట్టే చేపలు నీళ్లు లేకపోవడంతో.. వారికి సులువుగా దొరికాయి. అయితే... కుంటలో నీళ్లు తగ్గిపోవడం జనగాం జిల్లాలోని భూగర్భ జలాలు అడుగంటడానికి నిదర్శనమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.