తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.