చైనా మంజాపై.. సీపీ సజ్జనార్‌కు HRC నోటీసులు జారీ..

5 months ago 17
పతంగుల పండుగ వేళ ప్రాణాంతకంగా మారిన చైనా మాంజా (సింథటిక్ దారం) వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్రంగా స్పందించింది. ఈ దారం వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందిస్తూ.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు నోటీసులు జారీ చేసింది. మాంజా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఫిబ్రవరి 26 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే నగరవ్యాప్తంగా పోలీసులు సోదాలు చేసి లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article