జూలలో జంతువులను దత్తత తీసుకునేందుకు పౌరులు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. జీవవైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా నిలుస్తూ జంతువులను దత్తత తీసుకోవాలని కోరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తిరుపతి, విశాఖ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సందర్శకులకు మరింత ఆహ్లాదకర వాతావరణం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.