వైసీపీ అధినేత వైఎస్ జగన్కు జనసేన నేత కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. దమ్ముంటే కాపు నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీలోని ఐదుగురు కాపు నేతలలో ఒకరిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని.. అలా చేస్తే తాను కూడా ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. కాపులను విడగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు కిరణ్ రాయల్, పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ కాపు నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.