తెలంగాణ సీఎస్ ఎంపిక ప్రక్రియపై ఉత్కంఠ వీడటం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ సంజయ్ జాజును తిరిగి తమకే కేటాయించాలని ఇటీవల రేవంత్ సర్కార్ కోరగా.. తాజాగా దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంజయ్ జాజుకే.. తెలంగాణ సీఎస్ పగ్గాలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.