జగన్ గురించి విశాఖ సీపీకి ఆ విషయం తెలియదా?.. మాజీ మంత్రి అమర్

5 months ago 11
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం సీపీ వ్యాఖ్యలపై అమర్నాథ్‌ మండిపడ్డారు. వైఎస్ జగన్‌ జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు. మరోవైపు 'వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. విశాఖ నగర కమిషనర్‌ చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి. సీపీ హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారనే సంగతి సీపీకి తెలియదా?. వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సీపీ మాట్లాడడం సరికాదు. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యేకు అయితే ఎందుకు మూడువేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు?’ అని ప్రశ్నించారు.
Read Entire Article