జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామం వంటల ఖ్యాతితో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 25 మందికి పైగా పాకశాస్త్ర నిపుణులున్నారు. 60 ఏళ్ల క్రితం రాజేశుని నారాయణతో మొదలైన ఈ వంటల ప్రయాణం.. ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్రకు విస్తరించింది. మాజీ సీఎం కేసీఆర్ కార్యక్రమాలకు సైతం వంటలు చేసిన వీరు.. దాదాపు వంద మందికి ఉపాధినిస్తున్నారు.