జనగామ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి శంకుస్థాపన చేశారు. చంపక్హిల్స్లో 10 ఎకరాల్లో ఐదంతస్తుల ఆధునిక కోర్టు సముదాయం రెండేళ్లలో పూర్తవుతుంది. ఇది జిల్లా, మున్సిఫ్, సబ్, పోక్సో, మహిళా కోర్టుల అవసరాలను తీర్చనుంది. ఈ నిర్మాణంతో చంపక్హిల్స్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.