తెలంగాణలో వింత వాతావరణం నెలకొంది. పగటిపూట ఎండలు మండిపోతుంటే.. రాత్రిళ్లు చలి వణికిస్తోంది. ఆదిలాబాద్లో 34.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. తిర్యాణిలో 7 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విభిన్న వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన.