జర్మనీలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న జనగామ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి హృతిక్ రెడ్డి, అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పైనుంచి దూకి మృతి చెందారు. నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు ఆశించిన తల్లిదండ్రులకు కుమారుడి మరణవార్త పిడుగుపాటులా మారింది. ఇటీవల అమెరికాలోనూ ఇద్దరు తెలుగు విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదాన్ని నింపింది.