తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 494 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 349 పోస్టులకు సూత్రప్రాయంగా ఆమోదం లభించగా.. శాంతికుమారి కమిటీ పరిశీలన అనంతరం జీవోలు జారీ కానున్నాయి. గతంలో 1,654 మంది అతిథి అధ్యాపకులు ఉండగా.. ప్రస్తుతం 398 మందిని మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు.